Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతుబంధు పథకం కింద ప్రభుత్వం రెండో రోజు రూ.1255.42 కోట్లను విడుదల చేసింది. ఆ నిధులను జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం రూ.544.55 కోట్లను 18,12,656 మంది రైతుల ఖాతాలలో జమ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటి వరకు మొత్తం రూ.1799.99 కోట్లను 35,43,783 మంది రైతుల కోసం విడుదల చేశారు. రైతు కష్టం సీఎం కేసీఆర్ కు తెలుసని, అందుకే నిర్దిష్ట సమయంలో నిధులు విడుదల చేశామని మంత్రి పేర్కొన్నారు.