Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కి దేశీయ విమానయాన సంస్థలు వేల కోట్ల బకాయిలు పడ్డాయి. 2021 జనవరి నాటితో పోల్చితే 2021 నాటికి ఈ బకాయిలు రెట్టింపు అయ్యాయి. గడిచిన అక్టోబర్ ముగింపు నాటికి ఇండిగో, స్పైస్జెట్, గోఎయిర్, ఏయిర్ ఆసియా, విస్తార, ఎయిరిండియా అత్యధికంగా రూ.2,362 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఎయిరిండియా అత్యధికంగా చెల్లించాల్సి ఉండగా.. ఎయిర్ ఆసియా తమ బకాయిలను చెల్లించినట్లు ప్రకటించింది. భారత్లోని 100 పైగా విమానాశ్రయాలు ఏఏఐ పరిధిలో ఉన్నాయి.