Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మూడు కార్పొరేషన్లకు చెందిన నూతన చైర్మెన్లు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్(టీఎస్టీఎస్) సంస్థ చైర్మెన్గా పాటిమీది జగన్మోహన్రావు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మెన్గా గజ్జెల నగేష్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్గా మన్నె క్రిశాంక్ బుధవారం వారి వారి కార్యాలయల్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు వారికి అభినందనలు తెలిపారు. ఈ సదర్భంగా గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నూతన చైర్మెన్లను అభినందిస్తూ, సీఎం కేసీఆర్ కల్పించిన అవకాశాన్ని ఉపయోగించు కొని, పార్టీకీ, ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు.