Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పాలు, పాల ఉత్పత్తుల రంగంలో ప్రఖ్యాతిగాంచిన అమూల్ సంస్థ తెలంగాణలో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం కుదుర్చుకొంది. రాష్ట్రంలోని స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో మొదటి దశలో రూ.300 కోట్లు, రెండో దశలో రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దక్షిణ భారతదేశంలోనే అమూల్ తన తొలిప్లాంట్ను రోజకు 5లక్షల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నట్టు, భవిష్యత్తులో దీన్ని 10లక్షల లీటర్లకు పెంచుకునే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ప్లాంట్ నిర్మాణంతో పెరుగు, మజ్జిగ, లస్సీ, పన్నీర్, స్వీట్స్ వంటి వాటిని ఇక్కడ ఉత్పత్తి చేయనున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంతో పాటు బ్రెడ్, బిస్కెట్, బేకరీ పదార్థాలు కూడా ఉత్పత్తి చేయనుంది. ప్లాంట్ ఏర్పాటుతో 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని అమూల్ కంపెనీ తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన అమూల్ కంపెనీని మంత్రి కేటీఆర్ అభినందించారు. పెట్టుబడి పెట్టేందుకు అమూల్ తెలంగాణను ఎంచుకోవడం ద్వారా ఇక్కడి పాడి పరిశ్రమకు సైతం ప్రోత్సాహకరంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దక్షిణ భారతదేశంలోనే తన తొలి డెయిరీ ప్లాంటును తెలంగాణలో ఏర్పాటు చేస్తుండడంపై కంపెనీకి అభినందనలు తెలిపారు.