Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్రావు
నవ తెలంగాణ - సిద్దిపేట
సిద్దిపేట జిల్లాలో వానాకాలం సీజన్కు సంబంధించి 95,913 మంది రైతుల నుంచి రూ.760.55 కోట్ల విలువైన 3.88 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 2021-22 వానాకాలం సీజన్కు సంబంధించి రైతులు 3,17,161 ఎకరాల్లో వరి పంట సాగు చేశారన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ఐకేపీ, పాక్స్, ఏఎంసీ, మెప్మా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 412 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 225 ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 52,221 మంది రైతుల నుంచి 2,10,690 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 173 పాక్స్ కొనుగోలు కేంద్రాల ద్వారా 37,954 మంది రైతుల నుంచి 1,53,738 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. 9 ఏఎంసీ కొనుగోలు కేంద్రాల ద్వారా 4,296 రైతుల నుంచి 18,900 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 5 మెప్మా కొనుగోలు కేంద్రాల ద్వారా 1,442 రైతుల నుంచి 6,234 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో సజావుగా ముగిసిందని చెప్పారు. జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేందుకు కృషి చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి అభినందించారు.