Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ జేఏసీ చైర్మెన్ మధుసూదన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూనియర్ అధ్యాపకుల జోన్ల కేటాయింపుల్లో అనేక అవకతవకలు జరిగాయని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మెన్ డా.పి మధుసూదన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్యాశాఖలో ఆరువేల మంది అధ్యాపకులకు గాను కేవలం 725 మంది పని చేస్తుండగా అందరినీ వారు కోరుకున్న మల్టీ జోన్ కు కేటాయించే అవకాశం ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. కారుణ్య నియామకాల కింద నియమించబడిన వితంతువుల అభ్యర్థనలు కూడా పరిశీలించకుండా వారిని మల్టీ జోన్ కి బదిలీ చేయటం అభ్యంతర కరమని తెలిపారు.