Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ ఈ ఏడాది రికార్డు స్థాయిలో 8,413 కేసులను పరిష్కరించినట్టు ప్రధాన కమిషనర్ బుద్ధామురళి తెలిపారు. ఈ ఏడాది సమాచార హక్కు కమిషన్ అప్పీళ్లు 6,792 వచ్చాయనీ, మూడేండ్లు కమిషన్ పనిచేయకపోవడంతో పెండింగ్ కేసులు అలాగే ఉండిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కమిషన్ వద్ద పదివేల కేసులు ఉన్నాయనీ, ఒక్కో కమిషనర్ వద్ద 1500 కేసులు ఉన్నట్టు వివరించారు. ఆరునెలల్లో వాటన్నింటినీ పరిష్కరిస్తామన్నారు.