Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
రెండు రోజులపాటు జరిగిన సీపీఐ(ఎం) జనగామ జిల్లా ద్వితీయ మహాసభలో నూతన కార్యదర్శిగా మోకు కనకారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నూతన కమిటీతో కలిసి కార్యదర్శి మీడియా సమావేశంలో మాట్లాడారు. జనగామ జిల్లా కార్యదర్శిగా మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా ఎదునూరి వెంకట్రాజం, ఇర్రి అహల్య, రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, గొల్లపల్లి బాపురెడ్డి, రాపర్తి సోమన్న, బోట్ల శేఖర్, సింగారపు రమేష్, జిల్లా కమిటీ సభ్యులుగా బూడిది గోపి, పోత్కనూరి ఉపేందర్, బోడ నరేందర్, పొదల నాగరాజు, వెన్నకుస కుమార్, జోగు ప్రకాష్, బెల్లంకొండ వెంకటేష్, ఉర్సుల మహేశ్వరి, ఎండీ షబానా, భూక్యా చందు నాయక్, చిట్యాల సోమన్న, మునిగేల రమేష్, కోడెపాక యాకయ్య, జువారి రమేష్, ఎండీ అజారోద్దిన్ను ఎన్నుకున్నారు.