Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని పోలీసు స్టేషన్లకూ ఆదేశాలు జారీ : డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఒమిక్రాన్ వేరియంట్తో పాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకూ ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. అంతేగాక, వచ్చే జనవరి 2 వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించరాదని ప్రభుత్వం విధించిన నిషేదాజ్ఞలను ఉల్లంఘించినవారిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే, రోడ్లపై ప్రయాణికులు మాస్కులు ధరించకుండా తిరిగితే వారికి కచ్చితంగా చలాన్లు విధించాలని పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. ఒమిక్రాన్, కరోనా వైరస్లు తిరిగి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని డీజీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.