Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజక వృత్తిదారుల సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిన రజక మహిళల కుటుంబాలకు రూ: 5 లక్షల ఎక్గ్రేషియా ఇవ్వాలని రజక వత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి పి ఆశయ్య శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజీపల్లి గ్రామంలో బట్టలు ఉతకడానికి వెళ్లి ఇద్దరు రజక మహిళలు చెరువులో పడి మరణించారని తెలిపారు. కుల వృత్తిపై ఆధారపడి బతుకుతున్న వారు దుర్మరణం పాలయ్యారని పేర్కొన్నారు. చిన్న పిల్లలున్న ఆ కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.