Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 317 మందికి కరోనా సోకింది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 28,886 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. మరో 2,557 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,733 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 217 మందికి కరోనా సోకింది.
13 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో శుక్రవారంతో పోలిస్తే శనివారం జీహెచ్ఎంసీతో సహా 13 జిల్లాల్లో కేసులు పెరిగాయి. ఆదిలాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, కరీంనగర్, , ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, మెదక్, నారాయణపేట, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పెరిగాయి.
12 జిల్లాల్లో తగ్గిన కరోనా
జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, మేడ్చల్ - మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్లగొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, హన్మకొండ జిల్లాల్లో తగ్గాయి. మిగితా జిల్లాల్లో ఎలాంటి మార్పు లేదు.