Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నారాయణపేట టౌన్
నారాయణపేట జిల్లా కేంద్రంలోని లిమ్రా ఫంక్షన్ హాలులో నిర్వహించిన సీపీఐ(ఎం) జిల్లా ప్రథమ మహాసభలో నూతన కార్యదర్శిగా జి.వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 16 మందితో కూడిన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శివర్గ సభ్యులుగా కార్యదర్శి వెంకట్రామిరెడ్డితోపాటు గోపాల్, బలరాం, అంజిలయ్య గౌడ్, మాగనూరు ఆంజనేయులు ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా జోషి, కాశప్ప, బాలప్ప, దస్తప్ప, గోవిందరాజు, అశోక్, మహమ్మద్ అలీ, శివకుమార్, బొమ్మన్పాడు బలరాం, నరహరి ఎన్నికయ్యారు.