Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి
- యాచారం మండల ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం
నవతెలంగాణ-యాచారం
సీపీఐ(ఎం) రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రం సీపీఐ(ఎం) సభ్యుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల అభివృద్ధి కోసం సీపీఐ(ఎం) ఎన్నో ఉద్యమాలు చేస్తుందని తెలిపారు. సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభకు దాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందజేసి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్, కోర్ కమిటీ సభ్యులు మధుసూదన్రెడ్డి, యాచారం మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, నాయకులు పెరుమాండ్ల అంజయ్య, పెండ్యాల బ్రహ్మయ్య, చందు నాయక్, జంగయ్య, పెద్దయ్య, మల్లేష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.