Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఎస్ఐఐసీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం సావిత్రిబాయిఫూలే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సమాజంలో విద్యకు ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి మహిళల చదువుకు విశేష ప్రాచుర్యం కల్పించిన ఆదర్శ మహిళా మణి సావిత్రి బాయి పూలే అని టీఎస్ఐఐసీ చైర్మెన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. సంఘ సంస్కర్తగా, సామాజిక ఉద్దరణకు కషి చేసిన సావిత్రి బాయి పూలేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుడాల భాస్కర్, సికా చంద్రశేఖర్, ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు.