Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకూ ఈనెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెల వులు ప్రకటించాలని అధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు ఆదేశిం చారు. సోమవారం కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడు దల చేసింది. కరోనాకేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని విద్యా సంస్థలకూ ఈనెల8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని నిర్ణయిం చామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలకు ఈనెల 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులున్నాయి. ఇంటర్ బోర్డు, కళాశాల విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ల ప్రకారం జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీలకు ఈనెల 13 నుంచి 16వరకు సంక్రాంతి సెల వులు ప్రకటించాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సంక్రాంతి సెలవు లు పెరిగాయి. అయితే కరోనా తీవ్రతను బట్టి విద్యాసంస్థలను ప్రారంభించే అంశంపై సంక్రాంతి తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.