Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వికలాంగుల హక్కులను రక్షించడంలో టీఆర్ఎస్ విఫలమైందని కాంగ్రెస్ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మెన్ ముత్తినేని వీరయ్య విమర్శించారు. వారి సమస్యల పట్ల వివక్ష చూపిస్తున్నదని చెప్పారు. అంధుల లిపి ప్రదాత లూయిస్ బ్రెయిలీ 213 జయంతిని పురస్కరించుకుని మంగళవారం గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కండ్లు ఉండి చూడలేని కబోదిలా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు.