Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత కుటుంబాలకు రూ. 50వేల ఆర్థిక సాయం...: రజక వృత్తిదారుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రజక వృత్తిదారుల సంఘం చొరవతోనే రజక ఫెఢరేషన్ అధికారులు కదిలారని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్ జిల్లా, అల్లాదుర్గ మండలం, అప్పాజీ పల్లి గ్రామంలో బట్టలు ఉతుకుతూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించిన వారి కుటుంబాలకు (చాకలి బాషమ్మ ,చాకలి దుర్గమ్మ) రాష్ట్ర రజక ఫెెడరేషన్ ద్వారా ఒక్కొ కుటుంబానికి రూ:50వేలు ఆర్థిక సహాయం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక పెడరేషన్ సూపరిండెంట్ అబ్దుల్ బాసిత్, మెదక్ జిల్లా బీసీ అభివృద్ధి అధికారి బి కేశారాం, అసిస్టెంట్ అధికారి నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ కరుణాకర్తో పాటు రజక సంఘాల సమన్వయ సమితి చైర్మన్ అక్కరాజు శ్రీనివాస,్ రజక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులు, రజక సంఘం జిల్లా అద్యక్షులు సంగు స్వామి. తదితరులు పాల్గొన్నారు.