Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకుగాను ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2021లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చు. జనవరి ఐదో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి 11 వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవా లని యూనివర్సిటీ సూచించింది. నిర్దేశిత దరఖాస్తును పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లకు యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. దానికి అనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారాన్ని యూనివర్సిటీ వెబ్సైట్ షషష.సఅతీబష్ట్రర.్వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅలో తెలుసుకోవచ్చు.