Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్న జిల్లాల కేటాయింపులను ఏకపక్షంగా పూర్తి చేసేందుకే ఒమిక్రాన్ పేరుతో సంక్రాంతి సెలవులను ప్రభుత్వం పొడిగించిందని టీపీటీఎఫ్ విమర్శించింది. జీవోనెంబర్ 317 ఆధారంగా పోస్టింగ్ ఆర్డర్డు ఇచ్చేందుకు, ఉపాధ్యాయుల ఉద్యమాన్ని నిలిపేందుకే ఈ నిర్ణయం తీసుకుందని టీపీటీఎఫ్ అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సంక్రాంతి సెలవులను మూడు రోజులకు పరిమితం చేసి నూతన జిల్లాలకు కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా స్పష్టమైన మార్గదర్శకాలతో తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.