Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం కంటి చూపులేని వారి కోసం ప్రత్యేకంగా మున్సిపల్ చట్టం 2019 పుస్తకాన్ని బ్రెయిలీ లిపిలో రూపొందించిందని పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. మంగళవారం ప్రగతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. బ్రెయిలీలో ముద్రించిన పుస్తకం అనేక మందికి ఉపయోగపడుతుందనీ, దీన్ని సద్వనియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన పురపాలకశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎమ్ఏ) ఎన్ సత్యనారాయణను అభినందించారు. బ్రెయిలీ మున్సిపల్ చట్టంలో హరితహారం, గ్రీన్ బడ్జెట్, నీటి సరఫరా, వైద్యం, పారిశుద్ద్యం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, మరుగుదొడ్లు, వీధి దీపాలు, వీధులు, మార్కెట్లు, వైకుంఠధామాలు, శ్మశాన వాటికలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, వ్యాధుల నియంత్రణ, కాలుష్య నియంత్రణ, విపత్తు నిర్వహణ, భూముల అభివద్ధి, భవనాల నిర్మాణం, అనుమతులు, ట్రెడ్ లైసెన్సులు, సిటిజన్ సెంట్రిక్, ఈ-మున్సిపల్ సర్వీసెస్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ , ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దివాకర్ రావు, మాగంటి గోపినాథ్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.