Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకుల కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్లో ఆయనను టీఎస్టీసీఈఏ అధ్యక్షుడు అయినేని సంతోష్కుమార్ కలిశారు. అధ్యాపకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారు చర్చించారు. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని వినోద్కుమార్ చెప్పారు.