Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నూతన జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపుల్లో బీసీలు, మహిళలకు తీరని అన్యాయం జరుగుతున్నదని బహుజన్ క్లాస్ టీచర్ అసోసియేషన్ (బీసీటీఏ) అధ్యక్షుడు కె కృష్ణుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా విడుదల చేసిన జీవోనెంబర్ 317లో రిజర్వేషన్లను పొందుపరచలేదని పేర్కొన్నారు. ఓపెన్ కేటగిరీలో 50 శాతం, బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు ఆరు శాతం అన్ని రిజర్వేషన్ల కేటగిరీలోనూ మహిళలకు 33 శాతం న్యాయబద్ధంగా అమలు చేయాలని వివరించారు. కానీ 317 జీవోలో కేవలం ఎస్సీ,ఎస్టీలకే రిజర్వేషన్లు అమలు చేశారని తెలిపారు.