Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గత మూడు రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వందల్లో పెరుగుతున్నాయి. మంగళవారం 1,052 కేసులు రాగా బుధవారం అవికాస్తా 1,520కి పెరిగాయి. పాజిటివ్ రేటు 2.44 నుంచి 3.57కు చేరింది. ఒకరు మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 4,858 నుంచి 6,168కి ఎగబాకింది. గ్రేటర్తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి, భద్రాద్రి-కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, హన్మకొండ జిల్లాల్లో కేసులు అధికంగా వచ్చాయి.
కొత్త కేసుల కన్నా కోలుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా అంటే 209 మంది మాత్రమే ఉన్నారు. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు 42,531 మందికి టెస్టులు చేశారు. 7,039 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నవి. విదేశాల నుంచి వచ్చిన వారిలో మరో 68 మంది ఒమిక్రాన్ పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉన్నవి. రాష్ట్రంలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 979 కేసులొచ్చాయి.
22 జిల్లాల్లో పెరిగిన కోవిడ్
జీహెచ్ఎంసీతో పాటు 22 జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరిగాయి. ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, మెదక్, పెద్దపల్లి, వికారాబాద్, వరంగల్ రూరల్, హన్మకొండ జిల్లాల్లో తగ్గాయి. జయశంకర్ భూపాలపల్లి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఎలాంటి మార్పు లేదు.