Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తెలంగాణ ప్రభుత్వ సంయుక్తాధ్వర్యంలో 24వ ఇ-గవర్నెన్స్ రెండ్రోజుల జాతీయ సదస్సు శుక్రవారం నాడిక్కడి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో ప్రారంభంకానుంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అధ్యక్షత వహిస్తారు. ఈ సదస్సులో ఆత్మ నిర్భర్ భారత్తో పాటు పలు సాంకేతిక అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం నేషనల్ ఇ-గవర్నెన్స్ అవార్డ్స్ 2021 ప్రధానం చేస్తారు.