Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి 4,318 ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాలకు నడుపుతున్నట్టు టీఎస్ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ రీజినల్ మేనేజర్ బీ వరప్రసాద్ తెలిపారు. ఈనెల 7 నుంచి 14వ తేదీ వరకు ఈ బస్సులు నడుస్తాయి. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉంది. ఎమ్జీబీఎస్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులు బయల్దేరుతాయి. రాష్ట్రంలోని నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్, మెదక్, సిద్దిపేట వంటి ముఖ్యపట్టణాలతో పాటు విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, భీమవరం, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు సహా పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సుల్ని నడుపుతారు. ఆన్లైన్లో కూడా రిజర్వేషన్లుచేసుకోవచ్చని అధికారులు తెలిపారు.