Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగిల్ విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్..
నవతెలంగాణ వెల్దండ : ప్రజా సమస్యలను వెలికి తీస్తూ పేదల పక్షపాతి గా నవ తెలంగాణ దినపత్రిక నిలుస్తుందని వెల్దండ సింగిల్విండో డైరెక్టర్ మట్ట వెంకటయ్య గౌడ్ అన్నారు. గురువారం వెళ్లిన మండలం నవతెలంగాణ నూతన క్యాలెండర్ ను మట్ట వెంకటయ్య గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ.. నిష్పక్షపాతంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక పత్రిక నవతెలంగాణ అని ఆయన కొనియాడారు. పత్రికా రంగంలో నాటి నుంచి నేటి వరకు బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతున్న పత్రిక నవతెలంగాణ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ గౌడ్, పురుషోత్తం , భారత్ గౌడ్ ,నవతెలంగాణ ప్రతినిధి రవీందర్ యాదవ్ తదితరులు ఉన్నారు.