Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గూడ్స్ వాహనం బోల్తా
- 36మంది వలస కూలీలకు గాయాలు
- ముగ్గురి పరిస్థితి విషమం
- బాధితులంతా మహారాష్ట్రకు చెందిన వారే
నవతెలంగాణ-భూపాలపల్లి/రేగొండ
వారంతా వలసకూలీలే.. పొట్టకూటి కోసం మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు వెళ్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటన భూపాలపల్లి జయశంకర్ జిల్లా రేగొండ మండలంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. 36 మంది గాయాల పాలు కాగా అందులో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమింగా ఉన్నట్టు తెలిసింది. 20 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలి వద్ద క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి. వివరాలిలా.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఆస్తి గ్రామానికి చెందిన 18 మంది, చంద్రాపూర్ జిల్లా జునసుర్ల గ్రామానికి చెందిన 18 మంది.. మొత్తం 36 మంది వలస కూలీలు ఖమ్మం జిల్లాలో మిర్చి ఏరడానికి మహారాష్ట్ర నుంచి గూడ్స్ (ట్రాలీ) వాహనంలో వెళుతున్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రానికి చేరుకున్న వాహనం బోల్తా పడింది.