Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో బాయిల్డ్ రైస్ అందిస్తాం మిల్లర్లు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తమకు విధించిన లక్ష్యానికి అనుగుణంగా బాయిల్డ్ రైస్ను త్వరలో అందజేస్తామని వరంగల్ జిల్లాకు చెందిన రైస్ మిల్లర్లు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, గంగుల కమలాకర్కు వివరించారు. రాష్ట్రంలో 'ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్' పద్ధతిలో మిల్లర్ల నుంచి బియ్యాన్ని తీసుకుంటే, పౌరసరఫరాల కార్పొరేషన్పై భారం తగ్గి, సేకరణ వేగంగా పూర్తవుతుందని తెలిపారు. ఈ మేరకు మంత్రులకు వినతిపత్రాన్ని సమర్పించారు. మంత్రులను కలిసిన వారిలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ బృందం సభ్యులు తోట సంపత్ కుమార్, గోనెల రవిందర్, తక్కెళ్ళపల్లి యుగంధర్ తదితరులు ఉన్నారు.