Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరుపల్లి, సుధాభాస్కర్ సంతాపం
- నివాళులర్పించిన సీజీఎం ప్రభాకర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నవ తెలంగాణ దినపత్రిక ఫైనాన్స్ మేనేజర్ తన్నీరు శశిధర్ తండ్రి జనార్థన్ (65) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన కాలేయంతోపాటు ఇతర దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్లోని ఇఎస్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుతూ పరి స్థితి విషమించటంతో మరణించారు. జనార్థన్కు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే నవతెలంగాణ సీజీఎం ప్రభా కర్, బుకహేౌజ్ జనరల్ మేనేజర్ కోయ చంద్రమోహన్, జనరల్ మేనేజర్లు భరత్, రఘు, మేనేజర్ వీరయ్యతోపాటు పలువురు సిబ్బంది ఆస్పత్రికి వెళ్లా రు. ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. శశిధర్ ను ఓదార్చారు. జనార్థన్ మరణం పట్ల నవతెలంగాణ సబ్ కమిటీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, పత్రిక సంపాదకులు ఆర్.సుధా భాస్కర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. శశిధర్తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జనార్థన్ అంత్యక్రియలను శనివారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని ఆయన స్వగ్రామం భట్పల్లిలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.