Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 2,606 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 73,156 మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. మరో 11,167 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,180 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 1,583 మందికి కరోనా సోకింది.
23 జిల్లాల్లో పెరిగిన కేసులు
రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టుల్లో శుక్రవారంతో పోలిస్తే శనివారం జీహెచ్ఎంసీతో సహా 23 జిల్లాల్లో కేసులు పెరిగాయి. జయశంకర్ భూపాలపల్లి, మెదక్, ములుగు, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, హన్మకొండ జిల్లాల్లో తగ్గాయి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎలాంటి మార్పు లేదు.