Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బలవంతంగా జిల్లాలు మారిన ఉపాధ్యాయులకు పరస్పర అంగీకారంతో అంతర్జిల్లా బదిలీలకు అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు ఆదివారం టీఎస్యూటీఎఫ్ అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా నూతన జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారీగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. కొందరికి ఇష్టం లేకపోయినా సీనియార్టీ ఆధారంగా ఇతర జిల్లాలకు వారిని కేటాయించారని పేర్కొన్నారు.