Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజాసమస్యలపై చర్చించేందుకు ఈనెల 17న సీఎం కేసీఆర్ అపాయింట్మెంటు కోరుతాననీ, ఇవ్వకపోతే ప్రగతిభవన్ వద్ద దీక్ష చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తాను చేపట్టే దీక్షకు పోలీసులు అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా చేసి తీరుతానని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన అయిదు ముఖ్యమైన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 57 ఏండ్లకే రూ 3016 పెన్షన్, యువతీ,యువకులకు రూ 3016 నిరుద్యోగ భృతి, ఏకకాలంలో లక్ష రుణమాఫీ, మహిళ గ్రూపులకు మిత్తి లేని రుణాలు,హెచ్ఎమ్డీఏ పరిధిలో ఉన్న గ్రామపంచాయితిల్లో ఉన్న చట్టవిరుద్ధ లేఔట్లలోని ప్లాట్లు, భవనాలకు తక్షణమే రెగ్యులరైజ్చేయాలని డిమాండ్ చేశారు.