Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317ను వెంటనే సవరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం టీపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆ సంఘం అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 317 జీవో వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీచర్లు, ఉద్యోగులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉద్యమించాలని కోరారు. ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. స్థానికత కోల్పోయిన టీచర్లకు ప్రభుత్వం అంతర్జిల్లా బదిలీలు, పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని సూచించారు. భార్యాభర్తలు ఒకే జిల్లాలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 13 జిల్లాలకు విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల అప్పీళ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.