Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 327 డైరీ ఆవిష్కరణలో సీఎమ్డీ దేవులపల్లి ప్రభాకరరావు హామీ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విద్యుత్ ఉద్యోగులకు 2022 వేతన సవరణ చేస్తామని టీఎస్జెన్కో, ట్రాన్స్కో సీఎమ్డీ దేవులపల్లి ప్రభాకరరావు చెప్పారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లి, సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (327) 2022 నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారంనాడిక్కడి ఐఎన్టీయూసీ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై డైరీ ఆవిష్కరించి, ప్రసంగించారు. 1999 నుంచి 2004 మధ్య ఉద్యోగంలో చేరినవారికి పెన్షన్ సౌకర్యం కూడా పరిశీలిస్తామన్నారు. అన్ని కార్మిక సంఘాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి, నిర్ణయాలు తీసుకుంటామన్నారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్డీ జీ రఘుమారెడ్డి, యూనియన్ అధ్యక్షులు డాక్టర్ జీ సంజీవరెడ్డి, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ ప్రభాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 327 యూనియన్ సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ విద్యుత్ ఉద్యోగుల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు.