Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని బీజేపీ జాతీయ నేత మురళీధర్రావు ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ లేదనీ, ఆ పార్టీ నేతలే పదవుల కోసం కొట్టుకుంటున్నారని విమర్శించారు. బుధవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ..ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా పంజాబ్లో జరిగిన ఘటనల వెనుక రాజకీయ కోణం ఉందని ఆరోపించారు. ప్రధాని సెక్యూరిటీపై పంజాబ్ సీఎం, కాంగ్రెస్ నాయకత్వం రాజకీయం చేయడం తగదన్నారు. ఫెడరల్ సిస్టమ్లో ఘటనకు బాధ్యులైన వారిపై ఆ రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ పర్యటనలో పంజాబ్ సీఎం, డీజీపీ, సీఎస్లు ఎందుకు స్వాగతం చెప్పలేదని ఆయన ప్రశ్నించారు.