Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మెన్గా ఎంఐఎం ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్ఉల్హసన్ జాఫ్రీని నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉత్తర్వులు వెలువరించారు. శాసనమండలికి కొత్త చైర్మెన్ ఎంపిక జరిగేవరకు ఆ పదవిలో ఆయన కొనసాగుతారని బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రొటెం చైర్మెన్గా ఉన్న వెన్నంపల్లి భూపాల్రెడ్డి పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానంలో జాఫ్రీని నియమించారు. శాసనమండలి చైర్మెన్ రేసులో ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, కడియం శ్రీహరి ఉన్నట్టు ఆయా వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇప్పట్లో శాసనసభ, శాసనమండలి సమావేశాలు లేనందున వెంటనే ఆ పదవులను భర్తీ చేసే నియమించే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలఖారులోగానీ, మార్చి మొదటివారంలో గానీ జరిగే బడ్జెట్ సమావేశాలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. శాసనమండలి చైర్మెన్ ప్రకటించే అవకాశం ఉన్నది.