Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
నిబంధనలు అతిక్రమించే ప్రయివేటు ట్రావెల్స్ను ఉపేక్షించేది లేదని రవాణాశాఖ కమిషనర్ ఎమ్ఆర్ఎమ్ రావు హెచ్చరించారు. ప్రజా రవాణాకు ఆటంకం కలిగించే విధంగా ప్రయివేటు ట్రావెల్స్ నిర్వహకులు వ్యవహరిస్తే సహించబోమనీ చెప్పారు. ప్రజలకు ప్రయాణం భారం కాకుండా సౌకర్యవంతమైన రవాణాను అందించాలని మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆదేశించారనీ, వారి సూచనల మేరకు పది బందాలు దాడులు కొనసాగిస్తున్నాయన్నారు. కమర్షియల్ లగేజీ తీసుకెళ్లడం , అనుమతికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, అధిక చార్జీలు వసూలు చేయడం, రవాణా నిబంధనలను అతిక్రమించడం వంటి అంశాలపై ప్రత్యేక దష్టి సారించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు నిబంధనలు పాటించని104 ప్రయివేటు ట్రావెల్స్ బస్సులపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ నెల 17 వరకు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు , ప్రధాన కూడళ్లతో పాటు, జాతీయ రహదారులపై విస్తతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు.