Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కరోనా వైరస్ సోకడంతో స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన ఆదివారం రాత్రి రాగా వైద్యులు కోవిడ్కు సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భట్టి విక్రమార్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని భట్టి సూచించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు.