Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయివేటు జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రయివేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాలను ఇంటర్ బోర్డు హెచ్చరించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈనెల 30వ తేదీ వరకు సెలవులను ప్రభుత్వం పొడిగించిందని తెలిపారు. ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్, గురుకుల జూనియర్ కాలేజీలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని సూచించారు. ఈ సెలవుల్లో విద్యార్థులకు ఎలాంటి తరగతులనూ నిర్వహించొద్దని కోరారు. నిబంధనలను అతిక్రమించి తరగతులను నిర్వహిస్తే ఆయా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.