Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో నెంబర్ 132 జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎనిమిది జిల్లాలకు నూతనంగా అదనపు కలెక్టర్లను రాష్ట్ర సర్కారు నియమించింది. ఈ మేరకు జీవో నెంబర్ 132ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ విడుదల చేశారు. జగిత్యాల- బీఎస్ లత, నారాయణపేట-జి.పద్మజారాణి, రాజన్నసిరిసిల్ల-కీమ్యానాయక్, ములుగు-వైవీ గణేష్, వరంగల్ రూరల్-కె.శ్రీవాత్స, మహబూబాబాద్-ఎమ్.డేవిడ్, కామారెడ్డి-కె.చంద్రమోహన్లను నియమించింది. పలువురు రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఆర్డీఓలను కూడా బదిలీ చేసింది.