Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో నిర్వహణ
- కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు
- 400 మంది ప్రతినిధులు హాజరు
- నేడు ఆన్లైన్లో బహిరంగసభ
- రేపటినుంచి ప్రతినిధుల సభ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభలు శని వారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో జరగనున్నాయి. కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల కు అనుగుణంగా ఆహ్వాన సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో రెండు వేల మందికి సరి పడే హాల్లో 400మంది ప్రతినిధులు హాజరు కాను న్నారు. మహాసభలకు హాజరయ్యే ప్రతినిధులంద రూ ముందుగానే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించు కోవాలనే నిబంధనను పార్టీ విధించింది. రిపోర్టుల్లో నెగెటివ్ వచ్చిన వారికే అనుమతి ఉంటుంది. మహా సభల ప్రాంగణానికి వచ్చిన తర్వాత మళ్లీ రాపిడ్ ఆంటీజెన్ టెస్టులు నిర్వహిస్తారు. మహాసభలు జరుగుతున్న సమయంలోనూ ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వస్తే వారికి వైద్యసేవలందించేందుకు వీలుగా ఐసోలేషన్ కేంద్రాన్ని నిర్వాహకులు ఏర్పా టు చేశారు. డాక్టర్ల బృందం అందుబాటులోనే ఉం టుంది. మహాసభల కోసం ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహాసభలు ప్రారంభమయ్యే తొలిరోజు శనివారం సాయంత్రం నాలుగు గంటల కు ఆన్లైన్లో బహిరంగ సభ ఉంటుంది. ఆహ్వాన సంఘం అధ్యక్షులు, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగే ఈ సభలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్బ్యూరో సభ్యులు బృందాకరత్, బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి ప్రసంగిస్తారు. ప్రతినిధుల సభకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు పొలిట్బ్యూరో సభ్యులు ప్రకాశ్కరత్, బివి రాఘవులు హాజరవుతారు.
సమరశీల పోరాటాలకు రూపకల్పన
కేంద్రంలోని బీజేపీ దేశంతోపాటు రాష్ట్రానికీ అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే కార్యాచరణను మహాసభలో సీపీఐ(ఎం) రూపొందిస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మహాసభల్లో చర్చించి సమరశీల పోరాటాలకు రూపకల్పన చేయబోతున్నది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రవ్యాప్త పోరాటాలకు ఈ మహాసభ వేదిక కానుంది. వీటిపై అనేక తీర్మానాలను ఆమోదిస్తుంది. చివరిరోజు మంగళవారం సీపీఐ(ఎం) రాష్ట్ర నూతన కమిటీని, నాయకత్వాన్ని మహాసభ ఎన్నుకోనుంది.