Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాయుధ పోరాట యోధుడు ...
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ బండ్రు నర్సింహులు (103) తుదిశ్వాస విడిచారు. నల్లగొండ జిల్లా ఆలేరు గ్రామంలో 1918లో బండ్రు కొమురమ్మ, బుచ్చిరాములు దంపతులకు ఆయన జన్మించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో వారం నుంచి హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత బాగ్ అంబర్పేట్ తన పెద్దకుమారుడు బండ్రు ప్రభాకర్ నివాసంలో ఆక్సిజన్ సహాయంతో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్టుతో మరణించారు. ఆయన పార్థివదేహాన్ని మహబూబ్నగర్ మెడికల్ కాలేజికి డొనేట్ చేశారు. ప్రజల సందర్శానార్థం బాగ్అంబర్పేట్లో ఉంచిన పార్థివ దేహాన్ని శనివారం రాత్రి తరలించారు. ఆయన చిన్న కూతురు విమలక్క. 1944 మార్చిలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన 11వ ఆంధ్రమహాసభల్లో వాలంటీర్గా వెళ్లారు. ఆ సభల్లో వచ్చిన చీలికలో కమ్యూనిస్టుల వైపు నిలిచి సాయుధ పోరాట యోధుడిగా ఎదిగారు. 1946లో కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాట పిలుపునందుకుని యాదగిరి గుట్ట అయ్యగార్ల వేషంలో వెళ్లి రామగిరి పోలీసుస్టేషన్లో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 1948లో కొలనుపాకలో జరిగిన ఎదురుకాల్పుల్లో అరెస్టు అయి మూడునెలలపాటు జనగాం క్యాంపులో చిత్రహింసలకు గురయ్యారు. సీపీఐ చీలిక సమయంలో సీపీఐ(ఎం) వైపు నిలబడి ఆలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుడిగా పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఆయన నక్సలైట్ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. వివిధ కేసుల్లో శిక్ష పడి తన జీవిత కాలంలో 12ఏండ్లపాటు జైలు జీవితం గడిపారు. ఆయన మరణం పట్ల జనశక్తి నేత అమర్ సంతాపం వ్యక్తం చేశారు.