Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చిట్ఫంట్ సంస్థలు, ఫైనాన్స్ సంస్థల ఆర్థిక మోసాలపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు శనివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న చిట్ఫండ్ సంస్థలు, ఫైనాన్స్ సంస్థలు అధిక వడ్డీ, డివిడెండ్స్ పేరుతో పేద, మధ్యతరగతి ప్రజలను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. చిట్టీలు కట్టిన వారికి డబ్బులను ఎగ్గొట్టడం, చెక్లు ఇచ్చి అవి బౌన్స్ కావడం, కోర్టు చుట్టూ తిప్పి ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేస్తున్నాయని పేర్కొన్నారు. చిట్ఫండ్, ఫైనాన్స్ సంస్థల మోసాలను అరికట్టేందుకు ఇప్పుడున్న చట్టాల కంటే బలమైన చట్టం తేవాల్సిన అవసరముందని సూచించారు. ప్రజల డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగం మీద పెట్టుబడులు పెట్టిన ఆస్తులన్నీ బీనామీ ఆస్తుల కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ భూములను వేలం వేసి బాధితులకు తిరిగి డబ్బులు చెల్లించాలని కోరారు.