Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సత్యవతి రాథోడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదివాసీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకల పల్లి మండలం రాచన్న గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గూడెం, సాకివాగుకు చెందిన ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు అమానుషంగా ప్రవర్తించటం సరికాదన్నారు. వెంటనే ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ను ఆదేశించారు.