Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్టీసీఈఏ అధ్యక్షులు సంతోష్కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో ఉన్న స్ఫూర్తి ఇంజినీరింగ్ కాలేజీ భవనాలకు హెచ్ఎండీఏ అనుమతి నిరాకరించిందని టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తేల్చిచెప్పిందని పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినా ఇప్పటివరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అయినా ఏఐసీటీఈ ఆ కాలేజీకి అనుమతి ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ కాలేజీ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.