Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఈనెల 24వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. రోజూ 50 శాతం ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది బడులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన శనివారం ఆదేశాలు జారీ చేశారు. కరోనా నేపథ్యంలో ఈనెల 30వ తేదీ వరకు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఈనెల 24వ తేదీ నుంచి ఆన్లైన్ పాఠాలను బోధించాలని నిర్ణయించింది. అదే రోజు నుంచి రొటేషన్ పద్ధతిలో ప్రతి రోజూ 50 శాతం ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాఠశాలలకు హాజరు కావాలని తెలిపారు. ఆర్జేడీలు, డీఈవోలు ఈ ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించారు.