Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెడరేషన్ చైర్మెన్కు జీఎంపీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గొర్రెల పెంపకం దార్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గొర్రెల పెంపకం దార్ల ఫెడరేషన్ చైర్మెన్, పశు సంవర్దక శాఖ డైరెక్టర్కు గొర్రెల మేకల పెంపకం దార్ల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర కమిటి శనివారం వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొల్లకురుమల సంక్షేమానికి ప్రవేశ పెట్టిన గొర్రెల పంపిణీలో అవినీతి అరికట్టాలనీ, ,మిగిలిన 3.6లక్షల మందికి నగదు బదిలీ ద్వారా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పంపిణీ అనంతరం చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ నష్టపరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కిల్లె గోపాల్, రాష్ట్ర అధ్యక్షులు రావుల జంగయ్య, ఉపాధ్యక్షులు కె.లింగయ్య, సహాయ కార్యదర్శులు మేకల నాగేశ్వర్రావు, బొల్లం అశోక్, ఎం కార్తీక్తో పాటు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.