Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 4,393 మందికి కరోనా సోకింది. ఇద్దరు మరణించారు.శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 1,16,224 మందికి టెస్టులు చేశామని బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. వీరితో 9,537 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 31,199 యాక్టివ్ కేసులున్నాయి. జిల్లాల వారీగా చూస్తే జీహెచ్ఎంసీలో అత్యధికంగా 1,643 మందికి కరోనా సోకింది. మేడ్చల్ - మల్కాజిగిరిలో 421, రంగారెడ్డిలో 286, హన్మకొండలో 184, ఖమ్మంలో 128 కేసులొచ్చాయి. పాజిటివ్ రేటు 3.77 శాతంగా నమోదయింది.