Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాకతీయ మెగా టెక్స్ట్టైల్ పార్క్కు కేంద్ర బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి:
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు దాసు సురేష్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సమన్వయంతో చేనేత, జౌళి రంగ సమస్యలను పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు దాసు సురేష్ విజ్ఞప్తి చేశారు. చేనేత రంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మాని, ఈ అంశంపై పరస్పర దూషణలను సైతం విడనాడాలని చెప్పారు. ఈ మేరకు శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు ఇచ్చిన హామీ ప్రకారం రైతుల మాదిరే చేనేత, పవర్లూమ్ కార్మికులకు వెంటనే రూ.5 లక్షల భీమా అమలు చేయాలన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆత్మహత్య, వివిధ అనారోగ్య కారణాలతో మతి చెందిన 350 మంది చేనేత బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా, పక్కా ఇండ్లు, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన 50 శాతం నూలు సబ్సిడీ పథకం పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇక్కత్, చేనేత సిల్క్ వస్త్రాలను పక్క రాష్ట్రాలు ఇమిటేషన్ చేస్తూ తెలంగాణలో చేనేత మార్కెట్ను కొల్లగొడుతున్నాయనీ, దీనిపై ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ శాఖలను అప్రమత్తం చేసి నకిలీలను నిరోధించాలన్నారు. చేనేత సహకార సంఘాలకు ఏడేండ్లుగా ఎన్నికలు లేవనీ, తక్షణం వాటిని నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక చేనేత పవర్ లూమ్ కార్పొరేషన్లను రూ.100 కోట్ల నిధులతో ఏర్పాటు చేయాలన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఊరూరా తిరుగుతూ, బట్టలు అమ్ముకునే వారికి మోపెడ్లు, ట్రాలీలు అందజ ేయాలని కోరారు.
వత్తి రీత్యా తరచూ ప్రమాదాలకు లోనవుతున్న బీసీ కులవృత్తుల వారికి రూ.5 లక్షల ప్రమాద భీమాతో పాటు హెల్త్ కార్డు ఇవ్వాలన్నారు. కేంద్రప్రభుత్వం రానున్న బడ్జెట్లో చేనేత, జౌళి రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, నూలు, ముడి సరుకులు, రంగులు, రసాయనాలపై జీఎస్టీని సంపూర్ణంగా రద్దు చేయాలన్నారు.కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్క్కి కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్లో రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ని కేటాయించి, ఉత్తర తెలంగాణ నుండి వలసలను నిరోధిస్తూ, ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.