Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాల్స్లో బీఐఎస్ అధికారుల తనిఖీలు
- ఆటబొమ్మలు సీజ్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
చిన్న పిల్లల ఆటవస్తువులపై ఐఎస్ఐ మార్కు లేకుంటే రెండేండ్లు జైలుశిక్షతో పాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తామని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) హైదరాబాద్ శాఖ విభాగాధిపతి, సైంటిస్ట్ కేవీ రావు హెచ్చరించారు. చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపే ఆటవస్తువులపట్ల పెద్దలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా ఐఎస్ఐ మార్కు లేకుండా పిల్లల ఆటబొమ్మలు అమ్ముతున్నట్టు గుర్తిస్తే, తక్షణం తమ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రత్యేక తనిఖీల్లో భాగంగా బంజారాహిల్స్ సిటీ సెంట్రల్ మాల్లోని జస్ట్ ఫర్ యూ ఔట్లెట్లో తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. వారి నుంచి 199 నాన్ ఎలక్ట్రానిక్, 14 ఎలక్ట్రిక్ బొమ్మల్ని సీజ్ చేశారు. అక్కడి టారు కింగ్డమ్లో నిర్వహించిన తనిఖీల్లో 62 నాన్ ఎలక్ట్రిక్, 2 ఎలక్ట్రిక్ బొమ్మల్ని సీజ్ చేశారు. పంజాగుట్ట పీవీఆర్ నెక్ట్స్ గ్యాలరియా మాల్లో తనిఖీలు నిర్వహించి 56 నాన్ ఎలక్ట్రిక్, 24 ఎలక్ట్రిక్ బొమ్మల్ని సీజ్ చేసి, నోటీసులు ఇచ్చినట్టు వివరించారు. చిన్నపిల్లల ఆటవస్తువుల నాణ్యత విషయంలో పెద్దలు రాజీ పడొద్దనీ, అలా చేస్తే అవి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని చెప్పారు. మాల్స్లో జరిగిన తనిఖీల్లో సైంటిస్టులు పీవీ శ్రీకాంత్, ఎస్ వెంకటేష్, ఈ అభిసాయి, జీ శివప్రసాద్, రాహుల్ కుమార్, డిలీప్ చత్తర్, గోరేనాథ్ ప్రసాద్ యాదవ్, ఎల్ సురేఖ తదితరులు పాల్గొన్నారు.